CBI Case on GVK Group: ముంబై ఎయిర్‌పోర్ట్ పనుల్లో 800కోట్ల స్కామ్‌ జీవీకే గ్రూప్‌ ఛైర్మన్‌పై సీబీఐ కేసు

CBI Case on GVK Group: ముంబై ఎయిర్‌పోర్ట్ పనుల్లో 800కోట్ల స్కామ్‌ జీవీకే గ్రూప్‌ ఛైర్మన్‌పై సీబీఐ కేసు
x
Highlights

CBI Case on GVK Group: విద్యుత్, నిర్మాణ రంగంతో పాటు పలు కీలక రంగాల్లో సేవలందిస్తున్న జీవీకే గ్రూప్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

CBI Case on GVK Group: విద్యుత్, నిర్మాణ రంగంతో పాటు పలు కీలక రంగాల్లో సేవలందిస్తున్న జీవీకే గ్రూప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగినట్లు సీబీఐ తేల్చింది. దీంతో జీవీకే అధినేత కృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడు సంజయ్ రెడ్డితో పాటు పలువురిపై చీటింగ్ కేసు నమోదు చేసింది సీబీఐ. 2012-18 మధ్య కాలంలో తప్పుడు మార్గంలో 705 కోట్ల అవకతవకలు జరిగాయన్న కారణంతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారుల సహకారంతో జీవీకే గ్రూప్ ప్రమోటర్లు మోసానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కీలక రంగాల్లో పేరు ప్రతిష్టలున్న కృష్ణారెడ్డి కుటుంబంపై కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి... ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్ వెంచర్ ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం వీరు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్ధ మియాల్ తో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి 310 కోట్లను వీరు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇందులో పాత్రధారులుగా ఉన్న జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, ఆయన తనయుడు సంజయ్ రెడ్డిలతో పాటు మరికొందరిపై సీబీఐ అవినీతి కి పాల్పడినట్లు తేల్చింది..

ముంబై ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో బోగస్ వర్క్ కాంట్రాక్టులు, రిజర్వ్ ఫండ్‌ను దుర్వినియోగం చేయడం, ఖర్చు అంచనాలను పెంచడం ద్వారా నిధులను విత్‌డ్రా చేశారని సీబీఐ స్పష్టం చేసింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అనేది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే, ఇతర విదేశీ సంస్థల జాయింట్ వెంచర్. ఇందులో జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌‌కు 50.5 శాతం వాటా ఉండగా... ఎయిర్‌పోర్ట్ అథారిటీకి 26 శాతం వాటా ఉన్నట్లు సీబీఐ విచారణ లో వెల్లడైంది .. అయితే ఎయిర్‌పోర్ట్ ఆధునికీకరణ, నిర్వహణ కోసం 2006లో జీవీకేతో ఏఏఐ ఒప్పందం చేసుకొని ఎయిర్‌పోర్ట్ సమీపంలోని 200 ఎకరాల ఏఏఐ భూముల అభివృద్ధి కోసం ఎంఐఏఎల్ .200 కోట్ల బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించింది. ఫలితంగా రూ.305 కోట్ల నిధులను మళ్లించారనేది ప్రధాన ఆరోపణ , ఇక జీవీకే గ్రూప్ లోని ఇతర సంస్ధలకు ఆర్ధిక సాయం చేసే పేరుతో మరో 395 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఫస్ట్ ఇన్ ఫార్మేషన్ రిపోర్ట్ లో పేర్కొంది..

ముంబై తో పాటు హైదరాబాద్ లో సీబిఐ అధికారులు సోదాలు చేశారు .. సోదాల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లు ను స్వాధీనం చేసుకొని కీలక విషయాలు రాబట్టారు. జీవీకే చర్యల వల్ల ఏఏఐకి నష్టం వాటిల్లిందని సీబీఐ తన విచారణలో వెల్లడించింది .. జీవీకే గ్రూప్‌కి చెదిన కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా గ్రూప్ ఉదాసీనంగా వ్యవహరించిందని.. ఫలితంగా ఏఏఐకి నష్టం చేకూరిందని సీబీఐ తెలిపింది. ఎయిర్‌పోర్టులోని ప్రీమియం రిటైల్ ఏరియాలను కుటుంబ సభ్యులకు తక్కువ ధరకే కట్టబెట్టిందని.. ఫలితంగా అద్దెలు, అమ్మకాల రూపంలో ఎంఐఏఎల్‌కు సమకూరాల్సిన ఆదాయంపై తగ్గిందని సీబీఐ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories