యూపీలో సామాజిక వర్గాల పేరుతో ఉండే స్టిక్కర్లు బ్యాన్

యూపీలో సామాజిక వర్గాల పేరుతో ఉండే స్టిక్కర్లు బ్యాన్
x
Highlights

క్యాస్ట్ స్టిక్కర్లు అంటిస్తే సీజ్ చేస్తామని వార్నింగ్

సామాజిక వర్గాల పేరుతో వాహనాలపై స్టిక్కర్లు అంటించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అలాంటి స్టిక్కర్లు అంటిస్తే వాహనాల్ని వెంటనే సీజ్‌ చేస్తామని ఆ రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రకటించింది.

సమాజంలో ఈ తరహా ధోరణి చెడు సంస్కృతికి ఊతమిచ్చేలా ఉందని, సమానత్వ విధానానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఓ ఉపాధ్యాయుడు కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీఎమ్‌వో ఇలాంటి ధోరణి ఉపేక్షించరాదని రవాణాశాఖను ఆదేశించింది. దీంతో వారు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి సామాజిక వర్గాల పేర్లతో ఉన్న స్టిక్కర్లను తొలగించారు. ఇకపై అటువంటి స్టిక్కర్లు వాహనాలపై అంటిస్తే సీజ్‌ చేస్తామని ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories