India: బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి మూడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లు

Cargo Plane Leaves For India With 3 Oxygen Plants From UK
x

India: బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి మూడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లు

Highlights

India: దేశంలో ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం మూడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఇండియాకు పంపించింది.

India: దేశంలో ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం మూడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఇండియాకు పంపించింది. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానమైన ఆంటోనోవ్‌ 124 వీటిని తీసుకుని భారత్‌ బయల్దేరింది. ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ చేరుకుంటుంది. 40 అడుగుల కంటెయినర్ల పరిమాణంలో ఉంటే ఈ ఆక్సిజన్‌ జనరేటర్లు ఒక్కొక్కటి 18 టన్నుల బరువుంటుంది.

ఒక్కొక్కటి నిమిషానికి 500 లీటర్ల ప్రాణవాయివును ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు జనరేటర్లను విమానంలో ఎక్కించడానికి ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఒక రాత్రంతా పట్టినట్లు చెబుతున్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్లతో పాటు వెయ్యి వెంటిలేటర్లు కూడా బ్రిటన్‌ పంపించింది. ఇంతకుముందే బ్రిటన్‌ ప్రభుత్వం 200 వెంటిలేటర్లు, 495 ఆక్సిజన్ కాన్నంట్రేటర్లు కూడా పంపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories