Venkaiah Naidu Completing Three Years : ఉపరాష్ట్రపతిగా వెంకయ్య మూడేళ్ళు పూర్తి!

Venkaiah Naidu Completing Three Years : ఉపరాష్ట్రపతిగా వెంకయ్య మూడేళ్ళు పూర్తి!
x
Book launched on Venkaiah Naidu completing three years as vice president
Highlights

Venkaiah Naidu Completing Three Years : బీజేపీ నేత వెంకయ్యనాయిడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటికీ మూడేళ్లు పూర్తయ్యాయి..

Venkaiah Naidu Completing Three Years : బీజేపీ నేత వెంకయ్యనాయిడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటికీ మూడేళ్లు పూర్తయ్యాయి.. ముహమ్మద్ హమీద్ అన్సారి తరువాత ఆగస్టు 11, 2017 న అయన ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఈ మూడేళ్ళ కాలంలో ఎదురైన ప్రధానఘట్టాలను క్రోడీకరించి 'కనెక్టింగ్‌, కమ్యూనికేటింగ్‌, ఛేంజింగ్‌' పేరుతో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విడుదల చేశారు. ఈ పుస్తకం డిజిటల్‌ వెర్షన్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్‌జావడేకర్‌ ఆవిష్కరించారు..

ఈ పుస్తకంలో మొత్తం 250 పేజీలను ఉంచారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, ప్రయాణాలు, ఇతర ముఖ్యకార్యక్రమాలన్నింటికీ ఇందులో స్థానం కల్పించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన చేపట్టిన సంస్కరణలతోపాటుగా పలు అంశాలను ఇందులో వివరించారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో మిషన్‌ కనెక్ట్‌ పేరుతో వెంకయ్యనాయుడు అయన పాత స్నేహితులు, ఉపాధ్యాయులు, బంధువులు, ఆధ్యాత్మిక గురువులు, పాత్రికేయులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్న విషయాన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ఇక వెంకయ్యనాయిడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తో పాటుగా తదితరులు అయనకి అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయిడు మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా దేశప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఇక దేశంలో రోజురోజు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలని ఆ దేవుణ్ణి ప్రార్దిస్తున్నట్టుగా వెల్లడించారు వెంకయ్యనాయిడు..

Show Full Article
Print Article
Next Story
More Stories