వామ్మో.. 42 ఏళ్లుగా ఒక్క ట్రైన్ కూడా ఆగలే.. దేశంలోనే మోస్ట్ హాంటెడ్ రైల్వే స్టేషన్‌ ఇదే.. చీకటైతే చుక్కలే

వామ్మో.. 42 ఏళ్లుగా ఒక్క ట్రైన్ కూడా ఆగలే.. దేశంలోనే మోస్ట్ హాంటెడ్ రైల్వే స్టేషన్‌ ఇదే.. చీకటైతే చుక్కలే

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Aug 2024 6:53 PM IST
begunkodar called as haunted indian railway station in  west bengal closed for 42 years
X

వామ్మో.. 42 ఏళ్లుగా ఒక్క ట్రైన్ కూడా ఆగలే.. దేశంలోనే మోస్ట్ హాంటెడ్ రైల్వే స్టేషన్‌ ఇదే.. చీకటైతే చుక్కలే

Haunted Indian Railway Station: భారతీయ రైల్వే ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. రైల్వే ప్రమాదాలు చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు ఎల్లప్పుడూ రైల్వేల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. అలాగే, ప్రమాదాల నివారణ కోసం కూడా ఎన్నో కొత్త టెక్నాలజీలను మిళితం చేస్తున్నాయి. అయితే భారతదేశంలో 42 ఏళ్లుగా ఏ రైలు ఆగని రైల్వే స్టేషన్ ఒక్కటి ఉందని మీకు తెలుసా. దీనికి కారణం కూడా చాలా భయానకంగా ఉంటుంది.

సాధారణంగా రైల్వే స్టేషన్‌లు రైళ్లను ఆపడానికి ఉపయోగిస్తుంటారు. తద్వారా ప్రయాణీకులు ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఉంటుంది. అయితే, భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగిన ఏకైక రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. దీనికి కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ఉంది. దాని పేరు బెగుంకోదర్ రైల్వే స్టేషన్. సంతాల్‌కు చెందిన రాణి లచన్ కుమారి 1960లో దీన్ని ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఇక్కడ అంతా బాగానే ఉంది. కానీ, ఒక సంఘటన జరిగింది.

1967లో బేగుంకోదర్ రైల్వే స్టేషన్‌లోని ఒక రైల్వే ఉద్యోగి స్టేషన్‌లో ఒక మహిళా దెయ్యాన్ని చూసినట్లు పేర్కొన్నాడు. ఇది మాత్రమే కాదు, అదే స్టేషన్‌లో రైలు ప్రమాదంలో మహిళ చనిపోయిందని పుకారు కూడా వ్యాపించింది. ఇంతలో, మరో షాకింగ్ సంఘటన జరిగింది. రైల్వే క్వార్టర్‌లో అప్పటి స్టేషన్‌ మాస్టర్‌ బేగంకోదర్‌, అతని కుటుంబసభ్యులు శవమై కనిపించారు. దీని వెనుక అదే దెయ్యం ఉందని ప్రజలు పేర్కొన్నారు.

దీంతో రైల్వే అధికారులు కూడా రిస్క్ చేయకూడదని భావించారు. తర్వాత ఏం జరిగిందంటే రైల్వే స్టేషన్‌లోని ఉద్యోగులంతా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇక సూర్యాస్తమయం తర్వాత ఎవరూ ఇక్కడ ఉండడానికి ఇష్టపడడంలేదు. ప్రజలు కూడా ఈ స్టేషన్‌కు వచ్చేందుకు భయపడేవారు.

ప్రజలు ఎంతగానో భయపడి సాయంత్రం కాగానే ఈ స్టేషన్‌ పరిసరి ప్రాంతాల దరిదాపుల్లో కూడా లేకుండా పారిపోయేవారు. ఈ సంఘటనల తర్వాత ఇది హాంటెడ్ రైల్వే స్టేషన్‌గా పేరు పొందింది. కొన్ని నెలలుగా ఇక్కడ రైల్వే ఉద్యోగులను నియమించుకునేందుకు రైల్వేలు ప్రయత్నించినా ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ ఇక్కడ పనిచేయకూడదని ఫిక్స్ అయ్యారంట.

ఇది మాత్రమే కాదు, ఈ స్టేషన్‌లో దెయ్యం ఉందనే వార్త పురూలియా జిల్లా నుంచి కోల్‌కతాకు చేరుకుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా, చివరకు ఈ స్టేషన్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

దీంతో ఇక్కడ రైళ్లు ఆగడం కూడా నిలిచిపోయింది. కేవలం భయం కారణంగా, ఏ ప్రయాణీకుడు ఇక్కడ దిగడానికి కూడా ఇష్టపడలేదు లేదా రైలు ఎక్కడానికి ఎవరూ ఈ స్టేషన్‌కు రారంట. వీటన్నింటి ఫలితంగా 42 ఏళ్లపాటు మూతపడి ఉంది. చివరకు 2009లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఈ స్టేషన్‌ను మరోసారి ప్రారంభించారు.

కానీ, ఇప్పుడు కూడా ఒక్క రైల్వే సిబ్బందికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌ను ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 10 రైళ్లు ఆగుతాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story