శరద్ పవార్ నివాసంలో I.N.D.I.A. కూటమి సమన్వయ కమిటీ భేటీ

At Sharad Pawar Residence I N D I A Alliance Coordination Committee Meeting
x

 శరద్ పవార్ నివాసంలో I.N.D.I.A. కూటమి సమన్వయ కమిటీ భేటీ

Highlights

Sharad Pawar: భాగస్వామ్య పక్షాల చర్చలు ప్రారంభించాలన్న సమన్వయ కమిటీ

Sharad Pawar: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. శరద్‌ పవార్ నివాసంలో సమావేశమైన సమన్వయ కమిటీలోని నేతలు.. కూటమి తదుపరి కార్యక్రమాలు, సీట్ల సర్దుబాటు లాంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో అక్టోబర్ మొదటివారంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మొదటి బహిరంగ సభ నిర్వహించాలని సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మోడీ ప్రభుత్వ అవినీతిపై ఈ సభ నిర్వహించనున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు చేసిన నేతలు.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వెంటనే చేపట్టాలనే డిసిషన్ తీసుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పక్షాల చర్చలు త్వరితగతిన ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories