ఢిల్లీలో తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ

Arun Chilukuri
Published on: 16 July 2025 4:07 PM IST
ఢిల్లీలో తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ
X

తెలుగు రాష్ట్రాల నీటి వనరులపై కీలక చర్చలకు కేంద్రం వేదికైంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, ప్రాజెక్టుల వినియోగం, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి వివాదాల పరిష్కారానికి ఇది ఒక మైలురాయిగా భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story