Ajit Pawar: మరణానికి ముందు అజిత్ పవార్ చివరి ఫోన్ కాల్.. ఆడియోను బయటపెట్టిన శ్రీజిత్ పవార్!

Ajit Pawar: మరణానికి ముందు అజిత్ పవార్ చివరి ఫోన్ కాల్.. ఆడియోను బయటపెట్టిన శ్రీజిత్ పవార్!
x
Highlights

Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయ ధృవతార, ఎన్సీపీ (NCP) అధినేత అజిత్ పవార్ గత నెల 28న విమాన ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయ ధృవతార, ఎన్సీపీ (NCP) అధినేత అజిత్ పవార్ గత నెల 28న విమాన ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. బారామతిలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే, ఆయన మరణానికి కొద్ది నిమిషాల ముందు మాట్లాడిన చివరి ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు బయటకు వచ్చింది.

ముంబైలో విమానం ఎక్కే ముందు అజిత్ పవార్ తన పార్టీ నేత శ్రీజిత్ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సంభాషణకు సంబంధించిన వివరాలను శ్రీజిత్ తాజాగా బహిర్గతం చేశారు. ప్రమాదం జరగడానికి ముందు కూడా అజిత్ పవార్ తన రాష్ట్రం, పార్టీ సిద్ధాంతాల గురించే ఆలోచించారని ఆయన తెలిపారు.

"పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు ఆ రోజు ఉదయం నేను దాదా (అజిత్ పవార్)కు ఫోన్ చేశాను. మొదట నెట్‌వర్క్ సమస్య వల్ల కలవలేదు. కానీ ఆయన మెసేజ్ చూసి వెంటనే తిరిగి కాల్ చేశారు. ఆ కాల్‌లో ఆయన నాకు చేసిన సూచనలు వెలకట్టలేనివి. పార్టీలో ఎలాంటి అసమానతలకు, వివక్షకు తావుండకూడదని, అన్ని కులాలను, మతాలను కలుపుకుని వెళ్లాలని ఆయన స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్ర ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఆడియోను విడుదల చేస్తున్నాను" అని శ్రీజిత్ పవార్ పేర్కొన్నారు.

జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్‌లో బయలుదేరిన అజిత్ పవార్, సాంకేతిక లోపం కారణంగా విమానం క్రాష్ ల్యాండ్ కావడంతో దుర్మరణం పాలయ్యారు. తన చివరి శ్వాస వరకు ప్రజా సేవ, సామాజిక ఐక్యత కోసమే తపించిన నాయకుడిగా అజిత్ పవార్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories