Ajit Pawar Funeral: ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు.. బారామతిలో అశ్రునయనాల మధ్య ‘దాదా’కు వీడ్కోలు!

Ajit Pawar Funeral Updates: మహారాష్ట్ర రాజకీయ ధృవతార, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 29 Jan 2026 12:25 PM IST
Ajit Pawar Funeral: ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు.. బారామతిలో అశ్రునయనాల మధ్య ‘దాదా’కు వీడ్కోలు!
X

Ajit Pawar Funeral Updates: మహారాష్ట్ర రాజకీయ ధృవతార, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఆయన స్వగ్రామమైన బారామతిలోని విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో వేలాది మంది అభిమానులు, కార్యకర్తల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

హాజరైన ప్రముఖులు:

దేశవ్యాప్తంగా ఉన్న అగ్రనేతలు అజిత్ పవార్‌కు నివాళులర్పించేందుకు బారామతికి తరలివచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే మరియు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా హాజరై పవార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శరద్ పవార్, సుప్రియా సూలే, అజిత్ పవార్ కుమారులు పార్థ్, జయ్ పవార్ ఇతర కుటుంబ సభ్యులు ఈ విషాద సమయంలో పాల్గొన్నారు.

విమాన ప్రమాద నేపథ్యం:

జనవరి 28 (బుధవారం) ఉదయం ముంబై నుంచి బారామతికి జెడ్పీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం (లియర్ జెట్ 45) కూలిపోయింది. పొగమంచు కారణంగా రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో ల్యాండింగ్ సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక సెక్యూరిటీ ఆఫీసర్, ఒక సహాయకుడు ప్రాణాలు కోల్పోయారు.

అజిత్ పవార్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. బారామతి వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించి తమ ప్రియతమ నేతకు నివాళులర్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story