భారత్ లో ప్రకృతి విపత్తుల కారణంగా ఇంత మంది మరణిస్తున్నారా?

భారతదేశంలో ప్రకృతి విపత్తుల కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్నారు. ఈ సంవత్సరం వరదల కారణంగా వెయ్యికి పైగా మరణాలు..

Raj
By Raj
Published on: 14 Sept 2020 6:21 PM IST
భారత్ లో ప్రకృతి విపత్తుల కారణంగా ఇంత మంది మరణిస్తున్నారా?
X

భారతదేశంలో ప్రకృతి విపత్తుల కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్నారు. ఈ సంవత్సరం వరదల కారణంగా వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మూడు దశాబ్దాలుగా డేటాను విశ్లేషించింది. దీని ప్రకారం 2019 లో 4.21 లక్షల మంది మరణించారు. వీటిలో, రెండు శాతం మరణాలు ప్రకృతి వినాశనం కారణంగా జరిగాయి. ఇందులో కూడా పిడుగుల వలన ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తరువాత వేడి, వరద, చలి , కొండచరియలు విరిగిపడటం కారణంగా ఎక్కువమంది మరణించారు.

ఇది 2018 తో పోలిస్తే 18 శాతం ఎక్కువ. రాష్ట్రాల గురించి అయితే బీహార్ (1,521), ఒడిశా (1,466) లో ప్రకృతి విపత్తుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య దేశంలో మొత్తం మరణాలలో 35 శాతంగా ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర , జార్ఖండ్లలో దాదాపు వెయ్యి మరణాలు సంభవించాయి. 2019 లో దేశవ్యాప్తంగా ఉరుములు మెరుపుల కారణంగా రెండు వేల 876 మరణాలు సంభవించాయి. అంటే 35 శాతం, అలాగే వరదలు కారణంగా 16శాతం మరణాలు, భానుడి బగబగ ద్వారా 12 శాతం మరణాలు, చలి కారణంగా 10శాతం మరణాలు సంభవించాయి.

ఇక ఇదిలావుంటే గత మూడు దశాబ్దాలుగా ప్రకృతి విపత్తుల కారణంగా ప్రతిరోజూ 45 మంది మరణిస్తున్నారు. ఐదేళ్ళలో మొత్తం మరణాల వార్షిక సగటును పరిశీలిస్తే, 1990 - 1994 మధ్య, ఐదేళ్ళలో ప్రతి సంవత్సరం సగటున 5 వేల 751 మరణాలు సంభవించాయి. 1995-99 మధ్య, ఈ సంఖ్య ప్రతి సంవత్సరం సగటున 18 వేల 377 కు పెరిగింది. 2000 - 2004 మధ్య, ఈ సంఖ్య ప్రతి సంవత్సరం సగటున 20 వేల 926 కు పెరిగింది, 2005 - 2009 మధ్య ఐదేళ్ళలో ఐదు వేల మరణాలు సంభవించాయి. 2010 - 2014 మధ్య, మరణాల సంఖ్య సగటున 22 వేల 935 కు తగ్గింది మరియు 2015 - 2019 మధ్య ఈ సంఖ్య ప్రతి సంవత్సరం సగటున 7 వేల 916 ​​కు తగ్గింది.

Raj

Raj

Next Story