కరోనా వైరస్ : మృతుల్లో 70 శాతం పురుషులే..

కరోనా వైరస్ :  మృతుల్లో 70 శాతం పురుషులే..
x
Highlights

భారత్ లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతునే ఉంది. అయితే ఈ ప్రాణాంతక మహమ్మారి బారినపడి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,48,153 మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత్ లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతునే ఉంది. అయితే ఈ ప్రాణాంతక మహమ్మారి బారినపడి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,48,153 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ కారణంగా మరణించిన వారిలో ఎక్కవ మంది పురుషులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితిపై వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేశారు. మహిళల కన్నా పురుషులపైనే కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించింది. దేశంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారిలో 70శాతం మంది మగవారేనని వెల్లడించింది.

ఈ మహ‍మ్మరికి బలైన వారిలో 55శాతం మంది 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. కరోనా వ్యాప్తి నుంచి ఇప్పటి వరకు మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా ఉందని తెలిపింది. అయితే ఆరు నెలల తర్వాత తొలిసారి 17వేల కన్నా తక్కువ పాజిటివ్‌ కేసులు, 300 కన్నా తక్కువ మరణాలు సోమవారం నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.02శాతంగా ఉన్నట్టు తెలిపారు.

కొవిడ్‌ బారిన పడినవారిలో 63శాతం మంది పురుషులు కాగా.. 37శాతం మంది మహిళలు ఉన్నారు. వైరస్‌ సోకినవారిలో యువకులే అధికం. వైరస్‌ సోకినవారిలో 52శాతం మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సువారు ఉన్నారు. 60 ఏళ్లు పైన వారు 14శాతం, 26శాతం 45 నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఉన్నారు. 17 ఏళ్లకంటే తక్కువ వయస్సు గలవారు ఏనిమిది శాతంగా ఉన్నారని తెలిపింది.

భారత్‌లో తాజాగా నమోదైన కేసుల సంఖ్య 1,02,24,303కి పెరిగింది. వీరిలో 98,07,569 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,48,153 మంది (1.45శాతం) మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,68,581 ఉన్నాయి. ఈ యాక్టివ్‌ కేసుల్లో దాదాపు 60శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌, కేరళ, మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్‌గఢ్‌లలోనే పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర కొవిడ్‌ కేసుల తీవ్రత తక్కువగానే ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories