ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
x
Highlights

ఘోర ఒద్దు ప్రమాదం జరిగింది. బస్సు, బొలెరో ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారని వార్తా సంస్థ ఎఎన్‌ఐ..

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ఒద్దు ప్రమాదం జరిగింది. బస్సు, బొలెరో ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారని వార్తా సంస్థ ఎఎన్‌ఐ శనివారం తెలిపింది. పిలిభిత్ జిల్లాలోని పురాన్‌పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పిలిభిత్ పోలీసు సూపరింటెండెంట్ జై ప్రకాష్‌ చెప్పారని న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. పిలిభిత్‌ డిపో నుంచి లక్నోకు బయలుదేరిన బస్సును బోలెరో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఒక మహిళ సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది.

ఇక మరో 24 మంది స్వల్పంగా గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా మొత్తం 40 మంది, బొలెరోలో 10 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. బొలెరో డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ఈ ఘోరం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories