Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 50,210 కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 50,210 కరోనా పాజిటివ్ కేసులు
x
Highlights

Coronavirus Updates in India : భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. దేశంలో కేసుల సంఖ్య 83 లక్షల 64 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో...

Coronavirus Updates in India : భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. దేశంలో కేసుల సంఖ్య 83 లక్షల 64 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 50,210 కేసులు నమోదు కాగా, 704 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 55,331 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 83,64,086 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,27,962 ఉండగా, 77,11,809 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,24,315 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 92.20 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.49 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.31 శాతంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories