భారత్‌లో కొత్త‌గా 48,648 కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో కొత్త‌గా 48,648 కరోనా పాజిటివ్ కేసులు
x
Highlights

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 80 లక్షల 88 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,648 కేసులు నమోదు...

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 80 లక్షల 88 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,648 కేసులు నమోదు కాగా, 563 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 57,386 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 80,88,851 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,94,386 ఉండగా, 73,73,375 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,21,090 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 91.15 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.50 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.35 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 11,64,648 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 10,77,28,088 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories