Corona Cases in India: కొత్తగా 38,079 మందికి పాజిటివ్

38,079 New Corona Cases Reported in India on 17th July 2021
x

Representational Image

Highlights

Corona Cases in India: కరోనాతో మరో 560 మంది మృతి * 97.31 శాతానికి పెరిగిన రికవరీ రేటు

Corona Cases in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 19 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహిచగా.. వారిలో 38 వేల 79 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. కరోనాతో మరో 560 మంది బాధితులు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4 లక్షల 13 వేల 91కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మూడో వేవ్ ప్రారంభదశలో ఉందని ఇదివరకే డబ్యూహెచ్ వో హెచ్చరించింది. ఈ క్రమంలో రానున్న వంద రోజులు అత్యంత కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనల విషయంలో ఏమాత్రం అలసత్వం వద్దని హెచ్చరించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4 లక్షల 24 వేల 25 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా రికవరీ రేటు 97.31 శాతానికి పెరిగింది. 24గంటల్లో 43వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories