Punjab: సిద్ధూ మూసేవాలా హంతకుల ఎన్‌కౌంటర్

2 Sidhu Moose Wala Murder Suspects Killed In Encounter
x

Punjab: సిద్ధూ మూసేవాలా హంతకుల ఎన్‌కౌంటర్

Highlights

Encounter: పంజాబ్​ అమృత్​సర్​లోని చిచా భక్నాగ్రామంలో ఎన్​కౌంటర్​ జరిగింది.

Encounter: పంజాబ్​ అమృత్​సర్​లోని చిచా భక్నాగ్రామంలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులిద్దరు హతమయ్యారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు హతమైనట్టు పోలీస్ అధికారులు తెలిపారు. సిద్ధూ మూసేవాల హత్య కేసు నిందితులు చిచా భక్నా గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో నిందితులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో అధికారులు జరిపిన ఎదురుకాల్పులు ఇద్దరు గ్యాంగ్​స్టర్లు హతమయ్యారు. మృతులను జగ్​రూప్​ సింగ్​ రూపా, మన్​ప్రీత్​ సింగ్​గా పోలీసులు గుర్తించారు. వారి నుంచి ఏకే 47, పిస్తోల్​ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయపడినట్లు అధికారులు చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories