Tamil Nadu: చెన్నై సమీపంలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు రౌడీషీటర్ల మృతి..!

Chennai: చెన్నై తాంబరం సమీపంలోని గుడువంచెరిలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు మృతిచెందారు.

Arun Chilukuri
Published on: 1 Aug 2023 11:47 AM IST
2 Criminals Killed In Encounter By Tamil Nadu Police Near Chennai
X

Tamil Nadu: చెన్నై సమీపంలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు రౌడీషీటర్ల మృతి..!

Chennai: చెన్నై తాంబరం సమీపంలోని గుడువంచెరిలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు మృతిచెందారు. ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ తనిఖీలో ఉండగా, తెల్లవారుజామున బ్లాక్ స్కోడా కారులో అక్కడికి వచ్చిన నలుగురు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ స్వల్పంగా గాయపడగా, ఇద్దరు నిందితులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. గాయపడిన నిందితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ఇద్దరు నిందితులు మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story