Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 14,821 కరోనా పాజిటివ్‌ కేసులు

Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 14,821 కరోనా పాజిటివ్‌ కేసులు
x
Highlights

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే...

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 14,821 కేసులు నమోదు కాగా, 445 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 4,25,282 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,74,387 ఉండగా, 2,37,195 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 13,699 మంది కరోనా వ్యాధితో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 69,50,493. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన టెస్టుల సంఖ్య 1,43,267.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories