ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా

ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా
x
Highlights

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీలో కమ్యూనిటీ...

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దిశగా కరోనా వైరస్ వ్యాప్తి. ఢిల్లీలో 163 కి చేరిన కంటైన్మెంట్ జోన్ల సంఖ్య. గత 24 గంటల్లో 1,330 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంమీద ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 26,334కు పెరిగాయి. గత 24 గంటల్లో 25 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 708 మంది చనిపోయారు. ఢిల్లీలో 15,311 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,987 కేసులు నమోదు కాగా, 294 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో మొత్తం 2,36,657 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,15,942 ఉండగా, 1,14,072 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా,6,642 మంది వ్యాధితో మరణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories