Coronavirus: ఢిల్లీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 1,298 కొత్త కేసులు

Coronavirus: ఢిల్లీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 1,298 కొత్త కేసులు
x
Highlights

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,298 కరోనా కేసులు నమోదైనట్టు...

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,298 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు 497 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంమీద ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 22,132కు పెరిగాయి. గత 24 గంటల్లో 11 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 556 మంది చనిపోయారు.

భారత్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా 8,820కరోనా పాజిటివ్ కేసులు నమోద అయ్యాయి.గత 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా 221 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల 2,07,191 నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,01,066గా ఉంది. 1,00,285 చికిత్స కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి దేశంలో 5829 మొత్తం మృతి చెందారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories