ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి!

10 Dead as Fire Breaks out at Private Hospital in Madhya Pradesh Jabalpur
x

ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి!

Highlights

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు ఆస్పత్రి మొత్తానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మిగిలిన వార్డుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జబల్‌పూర్‌, దమోనాకా ప్రాంతంలోని న్యూలైఫ్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ ప్రమాదం నెలకొంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories