సాహో చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సాహో చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇది ప్రభాస్ 20వ సినిమా కావడం విశేషం.. ఇందులో ప్రభాస్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది. ఈ సినిమాకి "రాధేశ్యామ్" అనే టైటిల్ ని అనుకున్తున్నట్టుగా తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శేరవేగంగా జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన ప్రస్తుతం వాయిదా పడింది.
అయితే తాజాగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తన ట్విట్టర్ ద్వారా సినిమాకి సంబంధించిన లాంచింగ్ ఫోటోలని షేర్ చేశాడు. ఈ లాంచింగ్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు రాజమౌళి, వివి వినాయక్ , రెబల్ స్టార్ కృష్ణం రాజు తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేక ఆగ్రహంతో ఫ్యాన్స్ కి ఇది కొంచెం ఉరటను ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
ఇక లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా చివరి షెడ్యూల్ జార్జియాలో జరుపుకున్న సంగతి తెలిసిందే.. ఆ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు పూజాహెగ్డే, ప్రియదర్శిలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. పదిడిగ్రీల చలి, వర్షం, కరోనా భయల మధ్య సన్నివేశాలను తెరకెక్కించామని, ఇది చిత్రబృందంలోని స్ఫూర్తిని నింపాయనిదర్శకుడు రాధాకృష్ణకుమార్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ కథను చేయనున్న సంగతి తెలిసిందే..
Here is a glimpse of our darling from the opening ceremony of #prabhas20 #StayHomeStaySafe pic.twitter.com/uWfijGhulf
— Radha Krishna Kumar (@director_radhaa) May 8, 2020
And some more pic.twitter.com/6cP7UfDNjD
— Radha Krishna Kumar (@director_radhaa) May 8, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire