ఆ రోజు ఇద్దరం భావోద్వేగానికి గురయ్యాం : కాజల్ అగర్వాల్

ఆ రోజు ఇద్దరం భావోద్వేగానికి గురయ్యాం : కాజల్ అగర్వాల్
x
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. అక్టోబర్ 30 న కాజల్ వివాహం గౌతమ్‌ కిచ్లుతో జరిగిన సంగతి తెలిసిందే.. వీరి పెళ్ళికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. అక్టోబర్ 30 న కాజల్ వివాహం గౌతమ్‌ కిచ్లుతో జరిగిన సంగతి తెలిసిందే.. వీరి పెళ్ళికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అయితే పెళ్లి తరువాత ఓ మ్యాగజైన్‌ కి ఇంటర్వ్యూ ఇచ్చారు కాజల్ దంపతులు.. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇందులో కాజల్ మాట్లాడుతూ.. తనకి గౌతమ్ గత ఏడేళ్లుగా తెలుసని చెప్పుకొచ్చింది. తమ మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారిందని వెల్లడించింది. ఇక గౌతమ్ తానూ గత మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్టుగా వెల్లడించింది. లాక్‌డౌన్‌ తమ బంధాన్ని మరో అడుగు ముందుకు వేసేలా తీసుకువచ్చిందని కాజల్‌ చెప్పుకొచ్చింది. తాము ఇద్దరం వివిధ పార్టీల్లో కలుసుకునేవాళ్ళం కానీ లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి రావడం వలన కొన్ని వారాలపాటు కలుసుకోలేకపోయమని వెల్లడించింది. గౌతమ్‌ చాలా సున్నితంగా ప్రపోజ్‌ చేసిన విధానం తన మనసును తాకిందని, ఆరోజు ఇద్దరం భావోద్వేగానికి గురై చాలా సేపు మాట్లాడుకున్నామని వెల్లడించింది.

ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం కాజల్ .. కమల్‌ హాసన్‌,శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న 'భారతీయుడు 2'లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా దుల్కర్‌ సల్మాన్‌, అదితిరావు హైదరి జంటగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక తెలుగులో చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది కాజల్.. ఈ సినిమాలు కరోనా వలన వాయిదా పడ్డాయి. పెళ్లి అయ్యాక కూడా సినిమాలలో నటిస్తానని కాజల్ వెల్లడించిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories