వెంకీమామ కలెక్షన్స్ రిపోర్ట్: వెండి తెరను ఊపేస్తున్న మామా అల్లుళ్లు!

వెంకీమామ కలెక్షన్స్ రిపోర్ట్: వెండి తెరను ఊపేస్తున్న మామా అల్లుళ్లు!
x
Victory Venkatesh and Naga Chaitanya in Venky Mama
Highlights

వెండి తెరమీద వెంకీ మామ తన మేనల్లుడుతో కల్సి దూసుకు పోతున్నాడు. మొదటి రోజు బాక్సాఫీస్ కొల్లగొట్టిన వెంకీ మామ రెండోరోజూ అదే జోరు చూపించాడు.

నిజ జీవిత మామా అల్లుళ్లు తెలుగు తెరను షేక్ చేస్తున్నారు. దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ స్టామినాను బాక్సాఫీస్ వద్ద నిరూపిస్తున్నారు. సినిమాకి డివైడ్ టాక్ వినిపించినా.. ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో కలెక్షన్లలో 'వెంకీమామ' దూసుకుపోతున్నాడు.

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన 'వెంకీమమ' సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకి తొలిరోజు డివైడ్ టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్స్ మాత్రం ఒక రేంజిలో వచ్చాయి. తొలిరోజు బాక్సాఫీసును కొల్లగొట్టిన మామా అల్లుళ్ళు రెండో రోజు శనివారం కూడా అదే విధంగా దండయాత్ర చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఈ సినిమా 6.5 కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటింది. వరల్డ్‌ వైడ్‌గా ఫస్ట్ డే 8 కోట్ల వరకు గ్రాస్‌ సాధించింది 'వెంకీ మామ.'

ఈ వారం టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా విడుదలైంది. అదే 'వెంకీ మామ'. దీంతో సినిమాకి పోటీలేదు. ఈ నేపధ్యంలో మొదటి రోజు 8 కోట్లు సాధించిన ఈ సినిమా, రెండో రోజూ అదే రేంజిలో కలెక్షన్లు రాబట్టింది. పోటిగా మరే సినిమా లేకపోవటం, సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్సాన్స్‌ రావటంతో వెంకీ మామ మంచి వసూళ్లతో దూసుకుపోతున్నాడు. వీకెండ్‌ మామా అల్లుళ్లకు బాగా కలిసోచ్చింది. దీంతో రెండో రోజు కూడా థియేటర్ల ముందు హౌజ్‌ఫుల్‌ బోర్డులు కనిపించాయి. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 11.88 కోట్ల షేర్‌ సాధించిన వెంకీ మామ ప్రపంచ వ్యాప్తంగా 15.28 కోట్ల షేర్‌ వసూళు చేసినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 33 కోట్లు వసూళ్ళు రావాలని అంచనా. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే అది పెద్ద కష్టంగా కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మామా అల్లుళ్ళ జోడీకి తెలుగు ప్రేక్షకుల ఫిదా!

వెంకటేష్, నాగచైతన్య జోడీకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇద్దరూ కలసి సినిమాలో చేసిన కామెడీకి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్న ప్రేక్షకులు.. ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరి నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెంకీమామ లో వెంకీకి జోడిగా పాయల్ రాజ్‌పుత్‌ నటించగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. సురేష్‌ బాబు, టీవీ విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories