ఎఫ్ 2 సీక్వెల్ : రెమ్యునరేషన్ పెంచేసిన హీరోలు

ఎఫ్ 2 సీక్వెల్ : రెమ్యునరేషన్ పెంచేసిన హీరోలు
x
Highlights

అయితే ఈ సినిమాకి వెంకటేష్, వరుణ్ తేజ్ లు భారీ రెమ్యునరేషన్ లు డిమాండ్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. . ఈ మూవీ కోసం వరుణ్‌ రూ. 12 కోట్లు, వెంకీ రూ. 13 కోట్లను డిమాండ్‌ చేశారని తెలుస్తోంది.

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మేహరీన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లను కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే అనిల్ రావిపూడి ప్రకటించాడు. ఎఫ్ 3 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మళ్ళీ వెంకటేష్, వరుణ్ తేజ్ లే ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాను కూడా దిల్ రాజే నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి వెంకటేష్, వరుణ్ తేజ్ లు భారీ రెమ్యునరేషన్ లు డిమాండ్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. . ఈ మూవీ కోసం వరుణ్‌ రూ. 12 కోట్లు, వెంకీ రూ. 13 కోట్లను డిమాండ్‌ చేశారని తెలుస్తోంది. అటు వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో అనిల్ రావిపూడి కూడా తన రెమ్యునరేషన్ పెంచడాని సమాచారం. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది ఈ సినిమా. అటు వెంకటేష్ నారప్ప సినిమాతో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపధ్యంలో చేస్తున్న ఓ సినిమాతో బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories