పెళ్లి కూతురైన 'వదినమ్మ' సీరియల్ ఫేమ్ ప్రియాంక.. ఎమోషనల్ పోస్ట్

పెళ్లి కూతురైన వదినమ్మ సీరియల్ ఫేమ్ ప్రియాంక.. ఎమోషనల్ పోస్ట్
x
Highlights

సెలబ్రిటీలు తాము ఎంతగానో ఇష్టపడిన వ్యక్తిని కుటుంబ సమక్షంలో పెళ్లాడారు.

ఏడాది ప్రపంచం మొత్తం ఎక్కడ విన్నా కరోనా నామ జపమే వినిపిస్తుంది. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం పలువురు హీరోహీరోయిన్ల పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. చాలా మంది సెలబ్రిటీలు తాము ఎంతగానో ఇష్టపడిన వ్యక్తిని కుటుంబ సమక్షంలో పెళ్లాడారు. ఇక ఆకోవకే వచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్ట్, బుల్లితెర నటి 'వదినమ్మ' సీరియల్ ఫేమ్ ప్రియాంక నాయుడు. ఆమె మరో సీరియల్ నటుడు మధుబాబును పెళ్లాడబోతోంది. అయితే దీని గురించి కొన్నినెలల క్రితమే తాము స్వయంగా మధుబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ప్రియాంక నాయుడు వదినమ్మ సీరియల్‌లో 'సిరి' క్యారెక్టర్‌తో తెలుగు బుల్లితెరకు బాగా దగ్గరైంది. ఈ క్యారెక్టర్‌లో తెలంగాణ యాసలో అదరగొడుతూ ఫేమస్ అయింది. మధుబాబు విషయానికి వస్తే అభిషేకం సీరియల్ ద్వారా తెలుగులో ఫేమస్ అయిన మధుబాబు.. మంగమ్మగారి మనవడు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలాకాలం పాటు ప్రేమించుకున్న ప్రియాంక నాయుడు- మధుబాబు తాజాగా నవ వధూవరులుగా ముస్తాబయ్యారు. ప్రియాంక నాయుడు- మధుబాబు కొంతకాలంగా ప్రేమించుకుంటూ పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

ఇటీవలే మదర్స్ డే సందర్భంగా మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చిందని తెలుపుతూ తమ పెళ్లి విషయాన్ని మధుబాబు అధికారికంగా ప్రకటించాడు. తాను పెళ్లికూతురు అయ్యాయని ప్రకటిస్తూ హల్దీ ఫంక్షన్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసింది . కాగా ఈ ఫంక్షన్‌లో ప్రియాంక ఎమోషనల్ అవుతూ కనిపించడం విశేషం. దీంతో ప్రియాంక నాయుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories