ఓటీటీలో బాహుబలి నిర్మాత సినిమా ?

ఓటీటీలో బాహుబలి నిర్మాత సినిమా ?
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ వ్యాప్తి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దింతో ఉత్తరాది, దక్షిణాదిలోని అన్ని సినీ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో కురుకుపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో కూడా కొన్ని అధికారిక చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వంతోపాటు తమిళనాడు ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని షరతులతో సినిమా, సీరియల్స్ షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చాయి.

అయితే థియేటర్స్ మాత్రం ఇంత వరకు తెరచుకోలేదు. ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఒకవేళా సినిమా థియేటర్స్ ఓపెన్ చేసిన కూడా జనాలు థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోతే నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. ఈ నష్టాల బారి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ప్రజలంతా ఇళ్లలో ఉండడంతో ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్ సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయని ప్రచారం నడిచింది.

అయితే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకుండా జీ5లో డెరెక్ట్‌గా విడుదలై పరువాలేదనిపించింది. కీర్తి సురేష్ పెంగ్వీన్ కూడా ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్‌లో రానుంది. అంతేకాదు కీర్తి సురేష్ మిస్ ఇండియా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానుంది. తెలుగు సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి వంటి సినిమాను నిర్మించిన శోభు యార్లగడ్డ తాజాగా నిర్మిస్తున్న సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. ఈ సినిమాలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాను చిత్ర బృందం ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. డీల్ కుదిరితే త్వరలోనే ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. లక్ష్మీ బాంబ్ తెలుగు సినిమా కాంచన‌కు రీమేక్‌గా వస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories