Uday Kiran: ఓటీటీలో ఉదయ్‌ కిరణ్‌ చివరి సినిమా!

Uday Kiran Last Movie Chitram Cheppina Katha Releasing OTT
x

ఉదయ్ కిరణ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Uday Kiran: హీరో ఉదయ్‌ కిరణ్‌ 2014లో చనిపోయాడు. దాదాపు ఏడేళ్లు కావోస్తుంది.

Uday Kiran: హీరో ఉదయ్‌ కిరణ్‌ 2014లో చనిపోయాడు. దాదాపు ఏడేళ్లు కావోస్తుంది. ఆయన చివరిసారి నటించిన సినిమా 'చిత్రం చెప్పిన కథ'. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, ఉదయ్ కిరణ్ మరణించిన 2 నెలలకు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కానీ, పలు కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాలో మదల్సా శర్మ హీరోయిన్‌ గా నటించింది.

ఈ సినిమా తీసేప్పుడు పలువురు సన్నిహితులతో ఉదయ్ కిరణ్.. తన సినీ కేరీర్‌కు చాలా హెల్ప్‌ అవుతుందని చెప్పాడని సమాచారం. అయితే, ఈ సినిమా చివరి దశలో ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగత కారణాలతో ఉదయ్ కిరణ‌్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

మరలా ఇన్నేళ్లకు ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. అయితే 2020లో లాక్‌డౌన్‌ సమయంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని టాక్ నడిచింది. కానీ, రేటు విషయంలో మేకర్స్‌ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రస్తుతం అనేక సినిమాలు ఓటీటీలోనే విడుదలవున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు అధికంగానే ఆఫర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరో తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎదరయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం. మొత్తానికి 2013లో విడుదల కావాల్సిన 'చిత్రం చెప్పిన కథ' ఎనిమిదేళ్ల తర్వాత విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories