నటుడు అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది
నటుడు అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిందిఅందాల తార రాశీఖన్నా..చేసిన మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడం, నటిగా కూడా రాశీఖన్నాకి మంచి పేరు రావడంతో వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. అందులో భాగంగా సుప్రీమ్, జై లవకుశ,రాజా ది గ్రేట్,తొలిప్రేమ సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. కానీ ఇప్పుడు ఒకప్పటి లాగా చేతినిండా సినిమాలు అయితే చేతిలో లేవనే చెప్పాలి.
ప్రస్తుతం రాశీఖన్నా మూడు తెలుగు సినిమాలలో నటిస్తుంది. ఇందులో వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీమామ ఒకటి కాగా, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ప్రతిరొజూ పండగే అనే సినిమా మరోకటి , ఇదే కాకుండా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా ఉంది. ఇందులో వెంకీమామ, ప్రతిరొజూ పండగే సినిమాలు వారం వ్యవధిలోనే విడుదలకి సిద్దం అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాల సక్సెస్ పైన రాశీఖన్నా తర్వాత సినిమాలు ఆధారపడి ఉన్నాయి.
ఈ రెండు సినిమాలు హిట్టయితే పరవాలేదు. సినిమా ఆఫర్స్ వాటంతట అవే వస్తాయి. లేకపోతే పరిస్థితి మాత్రం మారుతుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు మంచి అంచనాలతో విడుదలకి సిద్దంగా ఉన్నాయి. రెండు కుటుంబ చిత్రాలు కావడం ఇక్కడ మరో విశేషం. ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్స్ ,సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చూడాలి మరి ఈ రెండు సినిమాలు రాశీఖన్నాకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో మరి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire