Ponniyin Selvan: మధ్యప్రదేశ్ లోని గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్న త్రిష

Trisha Joined in Mani Ratnam Ponniyin Selvan Movie Shooting in Madhya Pradesh
x

త్రిష (ట్విట్టర్ ఫోటో)

Highlights

Trisha: "రోజా", "బొంబాయి", "గీతాంజలి" వంటి సూపర్ హిట్ సినిమాలను మనకి అందించిన దర్శకుడు మణిరత్నం తాజాగా ఇప్పుడు ఒక ప్యాన్ ఇండియన్ సినిమాతో ప్రేక్షకుల...

Trisha: "రోజా", "బొంబాయి", "గీతాంజలి" వంటి సూపర్ హిట్ సినిమాలను మనకి అందించిన దర్శకుడు మణిరత్నం తాజాగా ఇప్పుడు ఒక ప్యాన్ ఇండియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "పొన్నియిన్ సెల్వన్" అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, విక్రమ్ ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇంత మంది స్టార్లు ఒకే తెరపై కనిపిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1955లో అదే టైటిల్ తో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న త్రిష ఇప్పుడు గుడిలో పూజలు చేస్తూ కనిపించింది. వివరాల్లోకి వెళితే సినిమా షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఓర్చాలో జరుగుతోంది. కార్తీ, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ చిత్ర షెడ్యూల్ పాల్గొంటున్నారు. సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో షూటింగ్లో పాల్గొంటున్న త్రిష కూడా సినిమా కోసం సినిమా షూటింగ్లో భాగంగా ఒక గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తోంది.

ఈ నెలాఖరు వరకు ఈ షూటింగ్ షెడ్యూల్ కొనసాగనుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా మణిరత్నం మరియు అల్లిరాజా సుభస్కరణ్ మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories