నితిన్ ప్లాన్స్ కి బ్రేక్ వేసిన కరోనా

నితిన్ ప్లాన్స్ కి బ్రేక్ వేసిన కరోనా
x
Nithiin (File Photo)
Highlights

యుంగ్ హీరో నితిన్ ప్లాన్స్ అన్నింటిపైనా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

యుంగ్ హీరో నితిన్ ప్లాన్స్ అన్నింటిపైనా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. భీష్మ సినిమాకి ముందు ప్లాపులలో ఉన్న నితిన్ కి భీష్మ రూపంలో ఓ హిట్ అయితే వచ్చింది. కానీ అప్పుడే కరోనా ప్రభావం దేశంలో మొదలైంది. దీనితో సినిమాకి టాక్ కి వచ్చినంతగా లాభాలు అయితే రాలేదని చెప్పాలి. ఇక ఈ ఏడాది మూడు సినిమాలను విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటే కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించడంతో షూటింగ్లు కూడా వాయిదా పడ్డాయి. అందులో భాగంగా సెట్స్ పైన ఉన్న రంగ్ దే చిత్రాన్ని జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటే ఇది ఆగిపోయింది.

ఇక మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంధాదూన్ రీమేక్ ని అగస్ట్ నుంచి మొదలు పెట్టాలని నితిన్ ప్లాన్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. అది వచ్చే ఏడాదిలో మొదలవుతుందని టాక్.. ఇక ఏప్రిల్ లో వివాహం ఫిక్స్ చేసుకున్న నితిన్ కరోనా వైరస్ ఎఫెక్ట్ తో అది కూడా వాయిదా పడింది. ఇలా నితిన్ నితిన్ ప్లాన్స్ అన్నింటిపైనా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడిందని చెప్పాలి. రంగ్ దే షూటింగ్ పూర్తి చేసిన తర్వాత లైన్‌లో పెట్టిన మూడు సినిమాల షూటింగ్స్ వచ్చే ఏడాదికే వాయిదా వేసుకున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories