బెల్లంకొండ కోసం బాహుబలి రైటర్!

బెల్లంకొండ కోసం బాహుబలి రైటర్!
x
Highlights

గత ఏడాది రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

గత ఏడాది రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ కుర్ర హీరో. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తోంది.

అయితే హిందీ ఆడియెన్స్ ను ఆక‌ట్టుకునేలా స్క్రిప్ట్ వ‌ర్క్ లో కొన్ని మార్పులు చేస్తున్నారట మేకర్స్.. ఆ మార్పులును చేసే బాధ్యతను రాజమౌళి తండ్రి కథ రచయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ కి అప్పజెప్పారని తెలుస్తోంది. వాస్తవానికి చత్రపతి సినిమాకి కూడా విజయేంద్రప్రసాదే కథను అందించారు కాబట్టి మార్పులు కూడా అయన చేస్తేనే బెటర్ అనే ఉద్దేశంతోనే ఆ బాధ్యతను అయనకి అప్పగించారట. దీనికి తోడు హిందీ సినిమాలకు పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ప్ర‌ధానంగా సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాల్లో మార్పులు చేయ‌నున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది.

ఇక అటు అల్లుడు అదుర్స్ సినిమా విషయానికి వచ్చేసరికి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి శ్రీనివాస్ ఏకంగా 8 ప్యాక్స్‌ లుక్ తో మెప్పించానున్నాడు.. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . డూడ్లే ఈ సినిమాకు సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories