తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం

తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం
x
Highlights

టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అయన మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమ‌వారం మృతి చెందారు.

టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అయన మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమ‌వారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె తన నివాసంలో మృతి చెందారు. త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి, కృష్ణవేణి భర్త కూడా నిర్మాతే.. నిర్మాతగా అయన పలు చిత్రాలను నిర్మించారు. ఇక కృష్ణవేణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడు అయిన లెనిన్ బాబు చనిపోగా, రెండో కుమారుడు భ‌రద్వాజ ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు.

ఇక మాతృమూర్తిని కోల్పోయిన అనంతరం త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. " త‌న త‌ల్లి అనారోగ్యంతో రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని, త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌ని, క‌రోనా తీవ్రత ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్దని ఆయ‌న కోరారు. కృష్ణవేణి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజకి ఫోన్ చేసి ప‌రామ‌ర్శిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories