ప్రభాస్ తో సినిమా పై అశ్వనీదత్ ఆసక్తికర కామెంట్స్

ప్రభాస్ తో సినిమా పై అశ్వనీదత్ ఆసక్తికర కామెంట్స్
x
Prabhas, Aswini Datt, Nag Aswin (File Photo)
Highlights

బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వీడే గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది.

బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది. తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్సకత్వంలో 'సాహో' అనే చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయింది. ఈ సినిమా తోలి రోజు ఆట నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా సుమారు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాదించింది. కేవలం బాలీవుడ్ లోనే ఈ చిత్రం సుమారు రూ. 200 కోట్ల భరీ వసూళ్లను సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.

'సాహో' తరువాత ప్రభాస్ 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. తరువాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ప్రస్తుతం కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకి సంబందించిన వర్క్ ను నాగ్ అశ్విన్ పూర్తి చేసి స్క్రిప్ట్ కుడా లాక్ చేసాడని సమాచారం.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ.. నిజానికి ప్రభాస్ ను మా సంస్థ ద్వారా హీరోగా పరిచయం చేయాలనుకున్నాం కానీ కుదరలేదు అని చెప్పుకొచ్చారు. ఈ లోగా బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ నేషనల్ వైడ్ హీరో అయ్యాడు అని అన్నారు. మహానటి చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథను రాసాడని.. ప్రభాస్ అయితే ఈ పాత్రకు న్యాయం చేయగలడని నాగ అశ్విన్ అన్నాడని.. అశ్విని దత్ చెప్పుకోచాడు. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో మొదలు పెట్టి 2022 ఏప్రిల్ లో విదుల చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రన్ని దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రతి నాయకుడు పాత్ర కోసం అరవింద్ స్వామి పేరు పరిసీలన లో ఉందని సమాచారం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories