మిథునం రీమేక్ : ఎస్పీబీ పాత్రలో అమితాబ్‌..!

మిథునం రీమేక్ : ఎస్పీబీ పాత్రలో అమితాబ్‌..!
x
Highlights

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

తెలుగు సినిమాలో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. కానీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అలాంటి సినిమాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీ లక్ష్మి నటించిన మిథునం సినిమా ఒకటి. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కేవలం రెండే పాత్రలతో తనికెళ్ల భరణి తెరకెక్కించిన విధానం అందరిని కట్టిపడేసింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిందని సమాచారం. సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుందని సమాచారం.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా రీమెక్ లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, అందాల తార రేఖ నటించానున్నారని బోగోట్టా. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఈ కాంబినేషన్‌ కుదిరితే అభిమానులకు పండుగనే చెప్పాలి. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.

Show Full Article
Print Article
Next Story
More Stories