థియేటర్స్ పై మొగ్గుచూపుతున్న టాలీవుడ్ ప్రొడ్యుసర్స్

Arun Chilukuri
Updated on: 30 Sept 2020 4:00 PM IST
థియేటర్స్ పై మొగ్గుచూపుతున్న టాలీవుడ్ ప్రొడ్యుసర్స్
X

ముందు నూయి వెనక గోయిలా తయ్యారైంది టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి. కరోనా దెబ్బతో కుదేలు అయిన నిర్మాతలకు ఇప్పుడు ఓటీటీలో రిలీజా..? థియేటర్‌లో రిలీజా అనే సంధిగ్దంలో పడుతున్నారు. థియేటర్స్ లేకపోవడంతో ఓటీటీ వైపు మొగ్గు చూపిన వాళ్ళు ఇప్పుడు ధియేటర్ల వైపు చూస్తున్నారు.

థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ ఓటీటీలో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకున్న నిర్మాతలకు దసరాకు ధియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉండటంతో, ఇక థియేటర్లలోనే రిలీజ్ చేయలనుకుంటున్నారు. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు అంత ఆదారణ పొందకపోవటంతో పాటు అసలు రిలీజ్ అయినట్టు కూడ తెలియడం లేదు. దీంతో మళ్ళీ నిర్మాతలు ధియేటర్ల వైపు చూపులు చూస్తున్నారు.

రీసెంట్‌గా రిలీజ్ అయిన పెంగ్విన్, 'వి' లాంటి సినిమాలు రిలీజ్ అయిన ఎవరికి అంతగా తెలియడం లేదు. ఇక నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అయిన అంత పబ్లిసిటీ కూడ రాలేదు సినిమాలకు. రానా సాయి పల్లవిల 'విరాట పర్వం'. ఓటిటిలో రిలీజ్ చేయాలనుకున్న చిత్ర యూనిట్,గత సినిమాలకు ఓటిటి దెబ్బ తగలటంతో మళ్ళీ ఆలోచనలో పడ్డారు ఎంత ఆలస్యం అయిన ధియేటర్లోనే రిలీజ్ చేయ్యాలని చూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story