మహేష్ నిర్మాతగా రామ్ చరణ్, వంశీ పైడిపల్లి సినిమా?

మహేష్ నిర్మాతగా రామ్ చరణ్, వంశీ పైడిపల్లి సినిమా?
x
Mahesh Babu, Vamshi Paidipally (File Photo)
Highlights

ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు మహేష్ బాబు..

ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు మహేష్ బాబు.. ఈ సినిమా తరవాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా ఉంటుందని మహేష్ అనౌన్స్ చేశాడు. మహేష్ బాబు 25 వ సినిమాని వంశీ పైడిపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి భారీ హిట్ ని అందించారు. ఈ నేపధ్యంలో ఇద్దరు మళ్ళీ కలిసి సినిమాని చేస్తున్నారని వార్తలు రావడంతో మంచి బజ్ ఏర్పడింది. కానీ మహేష్ అనూహ్యంగా ఈ స్క్రిప్ట్ ని పక్కన పెట్టేశారు.

అయితే ఇక ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ కాంబినేషన్‌లో మూవీ ఉంటుందట కానీ మహేష్ బాబు ఇందులో హీరోగా నటించారట.. ఈ స్ర్కిఫ్ట్‌కి హీరోగా తానూ సరిపోనని, అందుకే ఈ కథను మహేష్ పక్కన పెట్టారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రామ్ చరణ్ ఈ స్క్రిప్ట్ కి సూట్ అవుతాడని, కావాలంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేందుకు సిద్దం అని మహేష్ హామీ ఇచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్లో ఓ న్యూస్ నడుస్తోంది.

ప్రస్తుతం వంశీ చరణ్ కి ఆ కథ వినిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.. అన్నీ కుదిరితే చరణ్ హీరోగా మహేష్ నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లి, రామ్ చరణ్ కాంబినేషన్ లో గతంలో ఎవడు అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories