సద్గురు సన్నిధిలో సమంత

Samantha met Sadguru
x
సద్గురు జగ్గీ వాసుదేవ్ తో నటి సమంత (ఇంస్టాగ్రామ్ ఫోటో)
Highlights

హీరోయిన్ సమంత అక్కినేని కోయంబత్తూరు దగ్గరలోని సద్గురు జగ్గీదేవ్ ను కలుసుకున్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు సన్నిధికి టాలీవుడ్ హీరోయిన్ సమంత వెళ్ళారు. తమిళనాడు కోయంబత్తూరు ఔటర్ ప్రాంతంలో ఉన్న ఇషా ఆశ్రమం వద్దకు సమంత వెళ్ళారు. అక్కడ ఆశ్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ ను కలిశారు. ఆయనతో పలు ఆధ్యాత్మిక అంశాలపై చర్చించారు.

సమంత తాను సద్గురును కలిసిన విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు. ఆయనతో ఉన్న ఫోటోను షేర్ చేసిన సమంత ఆ ఫోటోతో పాటు మంచి సందేశాన్ని పోస్ట్ చేశారు. 'క్ర‌మ‌శిక్ష‌ణ సిద్దంగా ఉన్న‌పుడు స‌ద్గురు క‌నిపిస్తారు. నీకు నువ్వు గీసుకున్న హ‌ద్దుల‌ను చెరిపేయ‌డానికి భ‌క్తి బావ‌న కృషి ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ ఇంద్రియాలు మీరు బ‌యట విష‌యాల‌ను కానీ మీరు అనుభ‌వించే అస‌లైన విష‌యాలు లోప‌లున్నాయ‌ని మీరు గ్ర‌హించిన‌పుడు, వ‌చ్చేది జ్ఞానోద‌యం' అంటూ సమంత సద్గురును కలిసిన సందర్భంగా తన మనోభావాలను అభిమానులతో పంచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories