Tollywood: చర్చలు సఫలం.. రేపటి నుండి సినిమా షూటింగ్‌లు షురూ..

Tollywood Film Industry Workers Strike Stopped
x

Tollywood: చర్చలు సఫలం.. రేపటి నుండి సినిమా షూటింగ్‌లు షురూ..

Highlights

Tollywood: చిత్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కొలిక్కి వచ్చింది.

Tollywood: చిత్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కొలిక్కి వచ్చింది. సమ్మె ముగిసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో నిర్మాతలు సమావేశం అయ్యారు. ఫిల్మ్ చాంబర్ లో నిర్వహించిన ఈ సమావేశంలో కార్మికుల సమ్మె, జీతాల సుదీర్ఘంగా చర్చించారు. వేతనాలు పెంచేందుకు సిద్ధమని నిర్మాతలు ప్రకటించారు. సమస్యలన్నీ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు.

రేపటి నుండి సినిమా షూటింగ్ లు ప్రారంభంకానున్నాయి. ఈ సంధర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. మంత్రి తలసాని జోక్యంతో ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాం..రేపటి నుంచి యధావిధిగా షూటింగ్స్ జరుగుతాయి అని అన్నారు. రేపు కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తరువాత జీతాల పై క్లారిటీ వస్తుందని, ఫిల్మ్ ఛాంబర్ , ఫిల్మ్ ఫెడరేషన్ ద్వారా సాలరీస్ ఇస్తమని తెలిపారు కళ్యాణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories