Sarkar Vaari Paata: మహేష్ సరసన మహానటి!

Sarkar Vaari Paata: మహేష్ సరసన మహానటి!
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న ఈ...

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాకు సర్కారి వారి పాటగా టైటిల్ 'సర్కారు వారి పాట' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా అధికారికంగా చిత్రబృందం టైటిల్ ప్రకటించింది. టైటిల్‌ పోస్టర్‌ను మహేశ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మహేశ్‌ మాస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవి పోగుతో మెడపై రూపాయి టాటూతో మహేశ్‌ సరికొత్తగా కనిపించారు.

ఇక ఎప్పటినుండో అనుకున్నట్లుగా మహేష్ కోసం పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధం చేశాడట. పరశురామ్ తన స్కిప్టులో ఇటు మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా సన్నివేశాలు రాసుకున్నాడట. మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌‌గా కనిపించడమే కాదు.. కాలేజ్ స్టూడెంట్‌గాను అదరగొట్టనున్నాడట. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముందుగా కియారా అద్వానీ అనుకున్నారు. ప్రస్తుతం కియారా వరస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాలో చేయలేకపోతున్నట్టు మహేష్ బాబుకు చెప్పినట్టు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కార్ వారి పాట' సినిమాలో కథానాయికగా మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ను తెసుకున్నట్టు.. కీర్తి సురేష్ ఈ కథకు ఒకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో మహేష్ బాబుకు ఢీ కొట్టే విలన్ పాత్ర కోసం సుదీప్‌తో పాటు ఉపేంద్ర పేర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ లు ఆగిపోయాయి. షూటింగ్ లు మొదలుకగానే కీర్తి సురేష్ తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఈ సినిమాకు డేట్లు కేటాయించనుంది అని సమాచారం. త్వరలోనే కీర్తి సురేష్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మహేష్ బాబు 'సరిలేరు నేకేవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్నా చిత్రం కావటంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ ప‌తాకాలు కలిసి నిర్మిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories