అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ @3మిలియన్!

అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ @3మిలియన్!
x
Anushka Shetty (File Photo)
Highlights

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా అనుష్క కాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సూపర్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. కెరీర్ మొదట్లోనే అగ్ర కథానాయకులతో నటించే అవకాశం సంపాదించుకుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్న అనుష్క తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన కతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ముందుగా అనుష్క పేరునే పరిశీలిస్తారు అంటే అతిశయోక్తి కాదు...

అంతెందుకు సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసే కథానాయిక ఎవరంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనుష్క. ఇక నటిగా విభిన్న పాత్రలు చేస్తోన్న అనుష్క శెట్టి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని అనుష్క కి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. తాజాగా అనుష్క నిశ్శబ్ధం సినిమాలో పెయింటింగ్ వేస్తోన్న తన ఫోటోను షేర్ చేసిన తన అభిమానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న 'నిశబ్దం' సినిమా లో కథానాయికి గా నటిస్తుంది. ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే అమ్మాయి పాత్రను పోషిస్తుంది. పేరుకు తగ్గట్టు గానే ఈ చిత్రం ఒక సైలెన్స్ థ్రిల్లర్మ, మూకీ సినిమాగా 'నిశ్శబ్దం' తెరకెక్కింది. అయితే ఏప్రిల్ 2 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories