తెలంగాణలో పెరిగిన ఆచార్య సినిమా టికెట్ ధరలు
Acharya Ticket Price: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య .
తెలంగాణలో పెరిగిన ఆచార్య సినిమా టికెట్ ధరలు
Acharya Ticket Price: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య . కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోఆచార్య సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 29 నుంచి మే 5 వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్పై మల్టీప్లెక్స్లో రూ. 50, సాధారణ థియేటర్స్లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు వారం రోజుల పాటు అనుమతి కల్పించింది.
Next Story




