సైలెంట్ గా పెళ్లి పీటలు ఎక్కిన శ్రీమణి!

సైలెంట్ గా పెళ్లి పీటలు ఎక్కిన శ్రీమణి!
x
Highlights

నా జీవితంలోకి ఫ‌రాకు స్వాగతం చెబుతున్నాను. గ‌త ప‌దేళ్ళుగా ఈ క్ష‌ణం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశాం. ఎట్ట‌కేల‌కు మా క‌ల సాకార‌మైంది. మా మ‌న‌సుల‌ని అర్థం చేసుకున్న దేవుడికి , త‌ల్లిదండ్రుల‌కి ధ‌న్య‌వాదాలు

కరోనా సమయంలో కొందరు వెండితెర, బుల్లితెర నటినటులు పెళ్లి పీటలు ఎక్కారు. యంగ్ హీరోలు నితిన్, నిఖిల్, రానా ఓ ఇంటివాళ్ళు అయ్యారు. తాజాగా ప్ర‌ముఖ లిరిసిస్ట్ శ్రీ‌మ‌ణి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మీ రొమాంటిక్ లిరిక్స్ వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. 'ఇష్క్ సిఫాయా' అని పాడి.. 'రంగులద్దుకున్న' అని సీక్రెట్‌గా లవ్ చేసి.. 'ఏమిటో ఇది' అని మేమందరం అనుకునేలా పెళ్లిచేసుకున్నారన్న మాట'అంటూ ట్వీట్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్.

శ్రీమణి ఓ ఇంటివాడు కావడంతో అభిమానులు, సినీ సెలబ్రేటిలు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అటు తన వివాహం పైన భాగోద్వేగ ట్వీట్ చేశాడు శ్రీమణి. " నా జీవితంలోకి ఫ‌రాకు స్వాగతం చెబుతున్నాను. గ‌త ప‌దేళ్ళుగా ఈ క్ష‌ణం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశాం. ఎట్ట‌కేల‌కు మా క‌ల సాకార‌మైంది. మా మ‌న‌సుల‌ని అర్థం చేసుకున్న దేవుడికి , త‌ల్లిదండ్రుల‌కి ధ‌న్య‌వాదాలు" అంటూ ట్వీట్ చేశాడు శ్రీమణి. ఫ‌రా అనే అమ్మాయిని ప‌దేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శ్రీ‌మ‌ణి.

ఇక శ్రీమణి సినీ కెరీర్ విషయానికి వచ్చేసరికి సుకుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన 100%లవ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరచయం అయ్యాడు. ఈ సినిమాలో దటీజ్ మహాలక్ష్మి, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ మూడు పాటలు రాసే అవకాశం దక్కింది. తరువాత సెగ, జులాయి, బాడీగార్డ్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. శ్రీమణి ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ కు పాటలు రాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories