సినిమా ధియేటర్ల రీఓపెన్ పై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!

సినిమా ధియేటర్ల రీఓపెన్ పై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
x
Highlights

కరోనా వలన గత ఎనమిది నెలలుగా మూతపడిపోయిన సినిమా ధియేటర్లను తిరిగి తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనితో మంగళవారం నుంచి ధియెటర్లు ఓపెన్ కానున్నాయి. ధియేటర్ల రీఒపెన్ కి గాను కొన్ని నిబంధనలను విధించింది ప్రభుత్వం .

కరోనా వలన గత ఎనమిది నెలలుగా మూతపడిపోయిన సినిమా ధియేటర్లను తిరిగి తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనితో మంగళవారం నుంచి ధియెటర్లు ఓపెన్ కానున్నాయి. ధియేటర్ల రీఒపెన్ కి గాను కొన్ని నిబంధనలను విధించింది ప్రభుత్వం .

నిబంధనలు ఇవే!

1. 50 % సిట్టింగ్ కెపాసిటీతోనే ధియేటర్లను ఓపెన్ చేసుకోవాలి.

2.ప్రతి వ్యక్తి మాస్క్ కచ్చితంగా ధరించాలి.

3.శానిటైజర్ ను కచ్చితంగా ఉపయోగించాలి.

4. ప్రతి షో కి ముందు కామన్ ఏరియాలో శానిటైజన్ చేయాలి.

5. భౌతిక దూరం కంపల్సరీ

6. టెంపరేచర్ 24 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉంచాలి.

7.హ్యుమిడిటిని 40 నుంచి 70 శాతం మధ్య మైంటైన్ చేయాలి.

నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం తమ జీవోలో పేర్కొంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ పై వరాలు!

గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పై వరాల జల్లు కురిపించారు. కరోనా వలన నష్టపోయిన సినిమా పరిశ్రమకి భారీ రాయితీలు ప్రకటించారు. సినిమా ధియెటర్లు, పరిశ్రమలకు, అన్ని రకాల షాపులకు వచ్చిన కరెంట్ బిల్లును ( మినిమం డిమాండ్ చార్జీ ) చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు ఇది వర్తిస్తుందని అన్నారు. ఇక అన్ని రకాల ధియేటర్లలలో షోలు పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ తరహలో సినిమా టికెట్ల ధరలను సవరించే వెసులుబాటును కల్పించారు.

ఇక రూ. 10 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు SGST రీయంబర్స్ మెంట్ సాయం చేస్తామని వెల్లడించారు. చితికిపోయిన ప‌రిశ్ర‌మ‌ను పున‌రుజ్జీవింప‌చేయ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల సినీ పరిశ్రమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories