Mahesh Babu: 'సర్కారు వారి పాట' అప్‌డేట్ కోసం అప్పటి వరకు ఆగాల్సిందే!

Team Sarkaru Vaari Paata Releases a KEY Update
x

సర్కారు వారి పాట (ఫొటో ట్విట్టర్)

Highlights

Sarkaru Vaari Paata: మహేశ్ బాబు, కీర్తి సురేష్ కాంబోలో రాబోయే సినిమా సర్కారు వారి పాట'.

Sarkaru Vaari Paata: మహేశ్ బాబు, కీర్తి సురేష్ కాంబోలో రాబోయే సినిమా 'సర్కారు వారి పాట'. ప్రస్తుతం కరోనాతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాగా, చిత్రీకరణను తిరిగి ప్రారంభించేందుకు ఫిల్మ్ యూనిట్ ఉత్సాహంగా ఉందంట. అయితే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్‌ కోసం మహేశ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈమేరకు మేకర్స్‌కు సోషల్ మీడియాలో ఎన్నో రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. దీంతో ఎట్టకేలకు మేకర్స్ ఓ కీలక అప్‌డేట్‌ ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈమేరకు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు మేకర్స్. "సర్కారు వారి పాట కోసం మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మా రాబోయే అప్‌డేట్‌ కోసం మీరు తప్పక వేచి ఉండాల్సిన అవసరం ఉంది. తప్పకుండా త్వరలోనే కలుద్దామని, అప్పటి వరకు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని" నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు.

అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాతే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ అందిస్తామని నిర్మాతలు వెల్లడించారు. అప్పటి వరకు వేచి చూడాలని ఫ్యాన్స్‌ని కోరారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories