అపోలోలో తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తలసాని
* తేజ్ ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడా *హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది *మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందొద్దు -తలసాని
అపోలోలో తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తలసాని
Talasani Srinivas Yadav: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగా హీరో సాయిధరమ్ తేజ్కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తేజ్ కుటుంబ సభ్యులను మంత్రి తలసాని పరామర్శించారు. అనంతరం తేజ్ ఆరోగ్యంపై అపోలో వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తేజ్కు చిన్ని చిన్న గాయాలయ్యాయని, హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు మంత్రి. తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారని చెప్పిన తలసాని.. మెగా ఫ్యాన్స్ అందోళన చెందవద్దని కోరారు.
Next Story




