ప్రభాస్ అదిపురుష్ : లక్ష్మణుడిగా ఇతడేనా?

ప్రభాస్ అదిపురుష్ : లక్ష్మణుడిగా ఇతడేనా?
x
Highlights

బాహుబలి సినిమాతో భారతీయ సినీ చిత్ర పరిశ్రమలో వీపరితమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్..

బాహుబలి సినిమాతో భారతీయ సినీ చిత్ర పరిశ్రమలో వీపరితమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.. ఇక ప్రభాస్ మెయిన్ లీడ్ లో భారీ బడ్జెట్ తో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆఫీషియల్ గా వచ్చిన ప్రకటనతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరక్కుతుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమాలో సీతగా ఎవరు కనిపించనున్నారు? లక్ష్మణుడి పాత్రను ఎవరు పోషించనున్నారన్న దానిపైన చాలా ఆసక్తి నెలకొంది. ఈ పాత్రలకి గాను చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ వాటిపైన ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా ఈ లిస్టులోకి మరికొందరి పేర్లు కూడా చేరిపోయాయి. బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ సీత పాత్రను పోషిస్తుందని, లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్‌ నటించనున్నారని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే వీరితో 'ఆదిపురుష్‌' టీమ్‌ సంప్రదింపులు జరిపినట్లుగా బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

ప్రస్తుతం ప్రభాస్ జిల్ మూవీ ఫేం కె. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. వచ్చే ఏడాది సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories