Sree Vishnu: ఒక్క డైలాగుతో వివాదాన్ని సృష్టించిన శ్రీ విష్ణు

Sree Vishnu Created Controversy with a Single Dialogue in the Film Arjuna Falguna
x

ఒక్క డైలాగుతో వివాదాన్ని సృష్టించిన శ్రీ విష్ణు

Highlights

Sree Vishnu: ఆ వివాదాస్పద డైలాగును తీసేది లేదు అంటున్న శ్రీ విష్ణు

Sree Vishnu: "మెంటల్ మదిలో", "నీది నాది ఒకే కథ", "బ్రోచేవారెవరురా" వంటి ఎంటర్టైనింగ్ సినిమాలతో హీరోగా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈ మధ్యనే "రాజ రాజ చోర" అనే సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఇప్పుడు "అర్జున ఫాల్గుణ" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజ్, మహేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తేజ మర్ని దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 31వ తారీఖున థియేటర్లలో విడుదల కాబోతోంది.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అందులో హీరోయిన్ తనకు గ్రామ వాలంటీర్ జాబ్ వచ్చింది అని చెప్పగా హీరో ఆమెతో "అంటే ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులు ఇస్తారు అదా" అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది. వివాదాలకి ఆమడ దూరంలో ఉండే శ్రీ విష్ణు ఇప్పుడు ఒకే ఒక్క డైలాగ్ తో వివాదాల్లో ఇరుక్కోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ డైలాగ్ కట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని అడగగా శ్రీ విష్ణు మాత్రం ఈ డైలాగ్ ను కట్ చేసేది లేదు అంటూ చెప్పేసారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories