నరేష్ గుట్టు బయటపెట్టిన శివాజీ రాజా

నరేష్ గుట్టు బయటపెట్టిన శివాజీ రాజా
x
Highlights

'మా' మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఈసారి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ నరేష్ పై మండిపడుతున్నారు. తన పదవి కాలం ఇంకా ఉంది కాబట్టి అప్పుడే రాజీనామా చేసే...

'మా' మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఈసారి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ నరేష్ పై మండిపడుతున్నారు. తన పదవి కాలం ఇంకా ఉంది కాబట్టి అప్పుడే రాజీనామా చేసే ప్రసక్తే లేదు అని శివాజీ రాజా అంటున్నాడు అని నరేష్ చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో, "మా రూల్స్ ప్రకారం ఎప్పుడైనా మార్చిలో ఎన్నికలు నిర్వహించి ఏప్రిల్ లో కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తుంది. అదే విషయాన్ని నేను కూడా చెప్పాను కానీ రాజీనామా చేసేందుకు నేను నో చెబుతున్నట్లుగా నరేష్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు." అని శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు.

"మా డైరీ యాడ్స్ ద్వారా 14.2 లక్షల రూపాయలు వచ్చాయి. కాని మా అకౌంట్ లో మాత్రం కేవలం 7 లక్షలే పడ్డాయి. మిగిలిన డబ్బులు ఏమయ్యాయి అనే విషయం నరేష్ ఇప్పటి వరకు చెప్పలేదు. నరేష్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ల్ చాలా సార్లు నిధులు వృదా అయ్యాయి. మేము ఎన్నోసార్లు చెప్పేందుకు ప్రయత్నించినా సరే ఆయన మాత్రం పట్టించుకోలేదు. నేను, నరేష్, పరుచూరి గారు మలేషియా వెళ్లినప్పుడు మేము సాదారణ రూంలో ఉంటే నరేష్ మాత్రం సూట్ రూంలో ఉన్నాడు. ఆ సమయంలోనే ఆయన తాగి ప్లైట్ మిస్ అయితే నేను మరో టికెట్ వేసి ఆయన్ను పంపించాను." అని తీవ్ర ఆరోపణలు చేశారు శివాజీ రాజా.

"నేను మా మూలధనం 2.9 కోట్లు ఉన్న సమయంలో బాధ్యతలు స్వీకరించాను ఇప్పుడు మా మూలధనం 5 కోట్లు అయింది. కొత్త అధ్యక్షుడు నరేష్ మూల ధనంను 10 కోట్లకు పెంచేలా లక్ష్యంను పెట్టుకోవాలని సూచించాడు. నరేష్ లాగా నాకు కూడా 600 కోట్లు ఉంటే తప్పకుండా 6 కోట్ల రూపాయలను మా కోసం ఇచ్చి సొంతంగా స్థలం కొనుగోలు చేసి దాంట్లోనే మా భవనం నిర్మించేవాడిని" అని శివాజీ రాజా చెప్పుకొచ్చాడు. మొత్తానికి మా ఎన్నికలు పూర్తయ్యాక కూడా నరేష్ కి శివాజీ రాజా మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఆగేనో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories