వారిపై చర్యలు తీసుకోండి.. మంత్రి కేటీఆర్‌కు సింగర్ సునీత విఙ్ఞప్తి !

వారిపై చర్యలు తీసుకోండి.. మంత్రి కేటీఆర్‌కు సింగర్ సునీత విఙ్ఞప్తి !
x
Highlights

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఏ ఒక్క దేశాన్ని వదిలిపెట్టలేదు. కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు జనాలు హడలిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న మా...

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఏ ఒక్క దేశాన్ని వదిలిపెట్టలేదు. కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు జనాలు హడలిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి ఈ దరిద్రం ఏంటి రా బాబూ అని ప్రతీ ఒక్కరిలో ఆందోళన వ్యక్తమవుతుంది. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఈ వైరస్ ఇప్పుడు అందరికి సమన్యాయం చేస్తుంది. ఇది ఎప్పుడు అదుపులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా కరోనా మాత్రం ఆగడం లేదు. చాపకిందనీరులా వ్యాపిస్తున్నఈ వైరస్‌ ఇప్పుడు బాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని వెల్లడించిన ఓ యూట్యూబ్‌ ఛానెల్ థంబ్‌నైల్‌లో సునీత ఫొటోను బ్లర్ చేసి పెట్టారు. అది కాస్త ఆమె దృష్టికి చేరడంతో దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ విఙ్ఞప్తి చేశారు.

ఈ వార్తను ఓ ఫెస్ బుక్ పేజ్ 'ప్రముఖ సింగర్ కు కరోనా ఆసుపత్రికి తరలింపు' అని రాసి టాలీవుడ్ సింగర్ సునీత ఫోటోను పోస్ట్ చేశారు. దాంతో ఆమె దీనిపై యాక్షన్ తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన సునీత.. 'చందమామ కథలు అనే ఓ ఫేస్‌బుక్‌ పేజీ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పే వార్తకు నా ఫొటోను థంబ్‌నైల్ పెట్టారు. ఇది చాలా ఇబ్బందికి గురిచేసింది. సంబంధిత అధికారులు దీనిపై యాక్షన్ తీసుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా. నేను బావున్నా' అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంఓ, తెలంగాణ పోలీసులను ఆమె ట్యాగ్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories